BREAKING
మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులకు మరిన్ని సేవలు తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు ఇంధన ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: కిషన్ రెడ్డి రైతులకు శుభవార్త మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు తమిళనాడు సీఎం విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన చిరంజీవి బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గాజుల ముఖేష్ గౌడ్ మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులకు మరిన్ని సేవలు తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు ఇంధన ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: కిషన్ రెడ్డి రైతులకు శుభవార్త మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు తమిళనాడు సీఎం విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన చిరంజీవి బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గాజుల ముఖేష్ గౌడ్ మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన
www.ntodaynews.com

ఇంధన ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: కిషన్ రెడ్డి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 09:46 PM
9 వీక్షణలు

హైదరాబాద్, మే 15: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు పని లేకపోవడంతోనే ప్రజలను తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఆయా పార్టీల నేతల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.

శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం నిజమేనని తెలిపారు. పెంచిన ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని చెప్పారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

ఇది ప్రజలపై భారం మోపేందుకు తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. క్రూడాయిల్ దిగుమతులపై భారీ వ్యయం అవుతోందని, అందువల్లే కేంద్రం ధరల సవరణకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అంతర్జాతీయంగా అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో కూడా ఇంధన ధరలు పెరిగాయని తెలిపారు.

ఇదిలా ఉండగా, పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3కు పైగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.