www.ntodaynews.com
శ్రీ రామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం
తెలంగాణ
దోనూరులో వైభవంగా శ్రీ రామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం
కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
ధర్మపురి: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పూర్ణకుంభ స్వాగతం
గ్రామానికి చేరుకున్న మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన శాస్త్రోక్త కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
మంత్రి హామీ
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు ఆలయ భద్రత, సౌకర్యార్థం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Dharmapuri #TempleInauguration #RamaTemple #AdluriLaxmanKumar
Follow us on
Website
Facebook
Instagram
YouTube