www.ntodaynews.com
దావ వసంత సురేష్కు ఆహ్వానాల వెల్లువ
తెలంగాణ
జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్కు ఆహ్వానాల వెల్లువ
NTODAY NEWS: జగిత్యాల
జగిత్యాల: జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ను బుధవారం పలువురు సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు కలిసి వివిధ కార్యక్రమాలకు ఆహ్వానించారు.
శివాజీ జయంతి ర్యాలీకి ఆహ్వానం
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి వద్ద శివాజీ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీలో పాల్గొనాలని కోరుతూ శివాజీ సేన సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ గ్రామ సర్పంచ్ భావన మహేందర్, మాజీ సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ సంధ్యోచారి, వార్డు సభ్యులు పృథ్వీచారి, కొమురయ్య తదితరులు కలిసి ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ భక్తి భావం, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించే కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
#Jagtial #DavaVasanthaSuresh #ShivajiJayanthi #Raikal #TelanganaNews #PublicEvents
Follow us on
Website
Facebook
Instagram
YouTube