www.ntodaynews.com
జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్/ఢిల్లీ, జూలై 28: కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నాయకులు పాల్గొని జైపాల్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. దేశ రాజకీయాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలు, పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణలో పోషించిన పాత్ర చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.