జగిత్యాలలో చలివేంద్రం ప్రారంభించిన జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత
జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు ప్రారంభించారు. 19వ మరియు 20వ వార్డు బిఆర్ఎస్ పార్టీ నాయకులు చింతల గంగాధర్, తుమ్మనపల్లి సంతోష్ భారతి గార్ల ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తీర్చడానికి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా దావ వసంత గారు మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నాయకులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు, నాయకులు తాండ్ర సుధీర్, నీలి ప్రతాప్, బండి వంశీ బాబు, అరుముల్ల మానస శివ, కూతురు నరేందర్, తాడెపు మహేష్, పెండం గంగాధర్ తో పాటు 19, 20వ వార్డుల పెద్దమనుషులు, మహిళలు మరియు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.