www.ntodaynews.com
జిల్లా గ్రంథాలయ చైర్మన్కు ఘన సన్మానం
తెలంగాణ
/
జగిత్యాల
జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్ను సన్మానించిన స్తంభంపల్లి నాయకులు చిత్రపటం అందజేత
వెల్గటూర్ (జగిత్యాల):
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంగనభట్ల దినేష్ను మంగళవారం స్తంభంపల్లి గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దినేష్ను శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేక జ్ఞాపికను (ఫోటో ఫ్రేమ్) అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్తంభంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు కాష శ్రీధర్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పాదం దుబ్బస్వామి, మరియు తొగిటి పవన్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా నియమితులైన దినేష్ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చెందాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.