BREAKING
ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ​అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్ ​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు 175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి! పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మరో బంపర్ ఆఫర్ బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ​అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్ ​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు 175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి! పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మరో బంపర్ ఆఫర్ బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం
www.ntodaynews.com

​జిల్లా సరిహద్దుల్లో నిరంతర నిఘా..

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
19 May, 2026 - 05:47 PM
19 వీక్షణలు

​జిల్లా సరిహద్దుల్లో నిరంతర నిఘా.. అంతరాష్ట్ర చెక్ పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ

​బార్డర్లలో అలర్ట్: రాపనపల్లి చెక్‌పోస్ట్ వద్ద డీసీపీ భాస్కర్ మెరుపు తనిఖీలు!

​పశువుల అక్రమ రవాణా, దొంగ ధాన్యంపై ఉక్కుపాదం!

​మంచిర్యాల బ్యూరో, మే 19:

బక్రీద్ పండుగ వేళ అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు మంచిర్యాల పోలీసులు బార్డర్లలో నిఘా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ మంగళవారం కోటపల్లి మండలం రాపనపల్లి సరిహద్దు చెక్‌పోస్ట్‌ను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, డ్యూటీల కేటాయింపు, రిజిస్టర్లను స్వయంగా పరిశీలించి గ్రౌండ్ లెవెల్ లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.

​అక్రమ రవాణాపై 'నో కాంప్రమైజ్'..

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పండుగ తరుణంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే మొదటి ప్రాధాన్యత అన్నారు. అంతరాష్ట్ర సరిహద్దుల గుండా జరిగే ప్రతి కదలికపైనా 24/7 వాచ్ ఉంటుందని స్పష్టం చేశారు. అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద विभिन्न శాఖల అధికారులు, పోలీసులు కో-ఆర్డినేషన్‌తో పనిచేయాలని సూచించారు.

​రిజిస్టర్లలో ప్రతి వాహనం వివరాలు ఉండాల్సిందే!

సరిహద్దులు దాటే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చే అక్రమ వరి ధాన్యం లారీలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. తనిఖీ చేసిన ప్రతి వాహనం వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లలో ఎంటర్ చేయాలని సిబ్బందికి గట్టి ఆదేశాలు జారీ చేశారు