www.ntodaynews.com
జిందాల్ ప్లాంట్లో 'సైంటిఫిక్'గా గంజాయి ధ్వంసం: పవన్కు అధికారుల వెల్లడి
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
జిందాల్ ప్లాంట్లో 'సైంటిఫిక్'గా గంజాయి ధ్వంసం: పవన్కు అధికారుల వెల్లడి
ఎడ్లపాడు జిందాల్ ప్లాంట్ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అధికారులు పలు వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని గతంలో సాధారణంగా తగులబెట్టే వారని, కానీ ఇప్పుడు పర్యావరణానికి హాని కలగకుండా కోర్టు ఆదేశాల ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సమక్షంలో ఇక్కడే సైంటిఫిక్ పద్ధతిలో ధ్వంసం చేస్తున్నామని వివరించారు. ఇదే పద్ధతిలో ఇప్పటివరకు దాదాపు 40 టన్నుల నిషేధిత సిగరెట్లను కూడా కాల్చివేసినట్లు అధికారులు ఆయనకు తెలియజేశారు.