BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జియాగూడలో అక్రమ సమోసా కేంద్రంపై దాడి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Mar, 2026 - 06:54 AM
79 వీక్షణలు

జియాగూడలో అక్రమ సమోసా కేంద్రంపై దాడి  రు.5 లక్షల అపరిశుభ్ర ఆహార పదార్థాలు స్వాధీనం – వృద్ధుడు అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని జియాగూడలో అక్రమంగా నడుస్తున్న సమోసా తయారీ కేంద్రంపై ప్రత్యేక బృందం శుక్రవారం మెరుపు దాడి నిర్వహించింది. ఈ దాడిలో సుమారు రు.5 లక్షల విలువైన అపరిశుభ్ర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, కేంద్రాన్ని సీజ్ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ (73)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి 20 సాయంత్రం ప్రత్యేక బృందం, కుల్సుంపురా పోలీసులు, ఆహార భద్రత అధికారులతో కలిసి జియాగూడలోని ఒక నివాస గృహంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే సమోసా తయారీ జరుగుతున్నట్టు గుర్తించారు.

తనిఖీల్లో కుళ్లిపోయిన కోడిగుడ్లు, పదేపదే వాడిన నూనెతో సమోసాలు తయారు చేస్తున్నట్టు బయటపడింది. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన గుడ్డు, మక్కజొన్న, ఉల్లిపాయ సమోసాలు పెద్ద మొత్తంలో నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు.

ఈ దాడిలో పాడైన గుడ్లు 500, వాడేసిన నూనె 5 కిలోలు, గుడ్డు సమోసాలు 350, మక్కజొన్న సమోసాలు 600, ఉల్లిపాయ సమోసాలు 1000, మైదా 50 కిలోలు, ఉప్పు బస్తాలు, సమోసా పట్టీలు, అపరిశుభ్రమైన మక్కజొన్నతో పాటు వంట యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమ ఆహార తయారీ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.