జనార్ధనవరంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
జనార్ధనవరంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం
చాట్రాయి, ఆగస్టు 6: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామంలో గృహ నిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపుమేరకు గురువారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.
చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, కూటమి ప్రభుత్వానికి ప్రజలు తమ ఆశీర్వాదం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, చీఫ్ రాఘవేంద్రరావు, మహిళా కార్యకర్తలు పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.