www.ntodaynews.com
జనగణనపై పూర్తి అవగాహనతో ముందుకెళ్లాలి
తెలంగాణ
/
కరీంనగర్
జనగణన-2027 శిక్షణ కార్యక్రమంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం
జనగణన-2027 కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను అధికారులు సద్వినియోగం చేసుకొని, పూర్తి అవగాహనతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణన కోసం రూపొందించిన యాప్ రిజిస్ట్రేషన్, పనితీరుపై స్పష్టత కలిగి ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవాలని, నవీకరించిన మార్గదర్శకాల ప్రకారం సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. టెక్నికల్ అంశాలు, నియమ నిబంధనలపై పట్టు సాధించాలని అధికారులకు తెలిపారు.
ఈ శిక్షణలో మండల ఛార్జ్ అధికారులు (తహసిల్దార్లు), అదనపు ఛార్జ్ అధికారులు (నాయబ్ తహసిల్దార్లు), పట్టణ ఛార్జ్ అధికారులు (మున్సిపల్ కమిషనర్లు) మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, సిపిఓ రామ్ దత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు.