BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జనగణనపై పూర్తి అవగాహనతో ముందుకెళ్లాలి

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Mar, 2026 - 02:17 PM
183 వీక్షణలు
జనగణన-2027 శిక్షణ కార్యక్రమంలో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

జనగణన-2027 కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను అధికారులు సద్వినియోగం చేసుకొని, పూర్తి అవగాహనతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణన కోసం రూపొందించిన యాప్ రిజిస్ట్రేషన్, పనితీరుపై స్పష్టత కలిగి ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవాలని, నవీకరించిన మార్గదర్శకాల ప్రకారం సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. టెక్నికల్ అంశాలు, నియమ నిబంధనలపై పట్టు సాధించాలని అధికారులకు తెలిపారు.
​ఈ శిక్షణలో మండల ఛార్జ్ అధికారులు (తహసిల్దార్లు), అదనపు ఛార్జ్ అధికారులు (నాయబ్ తహసిల్దార్లు), పట్టణ ఛార్జ్ అధికారులు (మున్సిపల్ కమిషనర్లు) మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, సిపిఓ రామ్ దత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు.