www.ntodaynews.com
దొంగల ముఠా పట్ల పోలీసుల హెచ్చరిక
తెలంగాణ
/
మంచిర్యాల
జన్నారం మండలంలో దొంగల ముఠా పట్ల పోలీసుల హెచ్చరిక
జన్నారం: ఇటీవలి కాలంలో దొంగలు తమ పంథాను మార్చుకుని, పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో లక్సెట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ మూర్తి గారు జన్నారం మండల ప్రజలను అప్రమత్తం చేశారు. వేసవి కాలం మరియు పండుగల సీజన్లలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు దొంగల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిన ఆయన, ప్రతి గ్రామంలో సర్పంచ్ల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఇళ్లకు తాళం వేసి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతూ, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ జారీ చేసిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.