BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

దొంగల ముఠా పట్ల పోలీసుల హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల
18 Mar, 2026 - 03:13 PM
163 వీక్షణలు
జన్నారం మండలంలో దొంగల ముఠా పట్ల పోలీసుల హెచ్చరిక

జన్నారం: ఇటీవలి కాలంలో దొంగలు తమ పంథాను మార్చుకుని, పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో లక్సెట్టిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమణ మూర్తి గారు జన్నారం మండల ప్రజలను అప్రమత్తం చేశారు. వేసవి కాలం మరియు పండుగల సీజన్లలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు దొంగల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిన ఆయన, ప్రతి గ్రామంలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఇళ్లకు తాళం వేసి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతూ, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ జారీ చేసిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.