www.ntodaynews.com
జన్నారం మండలంలో నాటు బాంబుల కలకలం - పశువులకు తీవ్ర గాయాలు
తెలంగాణ
/
మంచిర్యాల
/
జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి గ్రామ సమీపంలోని గోదావరి తీరంలో ఆదివారం నాడు నాటు బాంబులు పేలడం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన ఈ నాటు బాంబులు ఒక్కసారిగా పేలడంతో మేతకు వెళ్లిన పలు పశువులు తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఘటనా స్థలంలో మరికొన్ని బాంబులు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరిగాయని, అడవి జంతువుల వేట కోసం దుండగులు వేస్తున్న ఈ బాంబుల వల్ల పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు