BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జ్ఞాన జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 12:40 PM
50 వీక్షణలు

జ్ఞాన జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా

పాలకుర్తి రిపోర్టర్ వేణు 

జ్ఞానజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ .

సామాజిక అసమానతలు, కుల వివక్ష, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి సమాజంలో సమానత్వం వెలుగులు నింపేందుకు తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే .

మహిళల విద్యకు నాంది పలికి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడి, ప్రతి మనిషికి సమాన అవకాశాలు ఉండాలనే మహోన్నత భావనను సమాజంలో నాటిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. విద్య ద్వారా సమాజాన్ని మార్చవచ్చని ఆయన చూపిన మార్గం ఈ రోజుకీ మనకు దిక్సూచి.

ఈ రోజు (ఏప్రిల్ 11) ఆయన జయంతి సందర్భంగా, దళితులు, మహిళలు మరియు పీడిత వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలని మనమందరం సంకల్పిద్దాం.

ఆయన చూపిన సమానత్వ మార్గంలో నడుస్తూ, సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం, గౌరవం, అవకాశాలు అందేలా కృషి చేయడం మన బాధ్యత.

మహాత్మా జ్యోతిరావు పూలే  ఆశయాలు సాకారం కావాలి అని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూణం శ్రవణ్ అన్నారు.

కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి కమిటీ నిర్వాహకులు సోమారపు ఐలయ్య, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు సోమ రాజశేఖర్,పదో వార్డ్ కౌన్సిలర్ ముద్దసాని సురేష్, డాక్టర్ రామ్ నరసయ్య, ఎంఈఓ బుచ్చయ్య, కొత్తపల్లి రవి, చిట్టి మల్ల మహేష్, రాయిశెట్టి వెంకన్న, రాయిశెట్టి ఉపేందర్, యాకమల్లు మంగళపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు