జూలై 1 నుంచి 5 వరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు వరుస పర్యటనలు
జూలై 1న 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
అదే రోజు సాయంత్రం తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీలో రూ.750 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న హీరో మోటోకార్ప్ ఆటో పార్ట్స్ సెంటర్కు శంకుస్థాపన చేస్తారు.
జూలై 2 ఉదయం తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్' (వీబీజీ రామ్జీ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
జూలై 2 సాయంత్రం తిరుపతిలో నిర్వహించే జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్కు హాజరవుతారు.
జూలై 3 ఉదయం కడప జిల్లా జమ్మలమడుగులోని సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభిస్తారు.
జూలై 3 నుంచి 5వ తేదీ వరకు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు.
జూలై 5న పర్యటనలు ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకుంటారు.