BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 15 July 2026, 08:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జూలై 30న కలెక్టరేట్ ముట్టడికి సీఐటీయూ పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:48 PM
59 వీక్షణలు

విస్సన్నపేట, జూలై 15: జూలై 30న ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కనీస వేతనాల సాధన కోసం నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ. వెంకటేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు.

విస్సన్నపేటలో బుధవారం గ్రామపంచాయతీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.21,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

జూలై 30న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ప్రతి కార్మికుడు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి పోతుల శ్రీనివాసరావు, పంచాయతీ కార్మికులు త్రినేశ్వరరావు, దుర్గ నాగరాజు, ప్రకాష్‌రావు, కంచర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.