BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జూలై 30న కలెక్టరేట్ ముట్టడికి సీఐటీయూ పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:48 PM
16 వీక్షణలు

విస్సన్నపేట, జూలై 15: జూలై 30న ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కనీస వేతనాల సాధన కోసం నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ. వెంకటేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు.

విస్సన్నపేటలో బుధవారం గ్రామపంచాయతీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.21,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

జూలై 30న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ప్రతి కార్మికుడు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి పోతుల శ్రీనివాసరావు, పంచాయతీ కార్మికులు త్రినేశ్వరరావు, దుర్గ నాగరాజు, ప్రకాష్‌రావు, కంచర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.