జూలై 30న కలెక్టరేట్ ముట్టడికి సీఐటీయూ పిలుపు
విస్సన్నపేట, జూలై 15: జూలై 30న ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కనీస వేతనాల సాధన కోసం నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ. వెంకటేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు.
విస్సన్నపేటలో బుధవారం గ్రామపంచాయతీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.21,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
జూలై 30న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ప్రతి కార్మికుడు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి పోతుల శ్రీనివాసరావు, పంచాయతీ కార్మికులు త్రినేశ్వరరావు, దుర్గ నాగరాజు, ప్రకాష్రావు, కంచర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.