www.ntodaynews.com
జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రూ. 2,728 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62,34,445 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందించనున్నారు.
ఈ నెలలో కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేయగా, వాటి కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లు విడుదల చేశారు. జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పెన్షన్ల కోసం మొత్తం రూ. 65,886.57 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తూ సంక్షేమ పాలన కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.