www.ntodaynews.com
జులై 15 నుంచి ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల అమలు
తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) హెల్త్ కార్డులను జులై 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈహెచ్ఎస్ అమలులోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలను పొందే అవకాశం కలగనుంది.