BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

పేకాట స్థావరంపై కోటపల్లి పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
63 వీక్షణలు

 మంచిర్యాల జిల్లా: కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.12,640 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, జూలై 11న విశ్వసనీయ సమాచారం మేరకు ఆల్గాం గ్రామ శివారులోని ఎస్‌ఆర్‌ఆర్ ఫర్టిలైజర్ షాప్ వద్ద కొందరు డబ్బులు పందెంగా పెట్టుకుని మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు దాడి చేయగా ఇద్దరు పరారయ్యారు. సంఘటనా స్థలంలో దుర్గం రామ్‌దేవ్, గట్టు తిరుపతి గౌడ్, గారె రాజలింగు, అల్లూరి అభిషేక్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పరారైన వారు గట్టు శ్రీనివాస్, రామ్‌టెంకి సునీల్‌గా గుర్తించారు.

స్వతంత్ర పంచుల సమక్షంలో నిందితుల వద్ద నుంచి రూ.12,640 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడిలో ఎస్‌ఐ ఎస్. రాజశేఖర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు, కానిస్టేబుళ్లు శ్రావణ్, నరేష్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

పేకాట, జూదం, మాదకద్రవ్యాలు, గుడుంబా తయారీ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఇటువంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.