యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ప్రమాణ స్వీకారం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతిని దేవరుప్పుల మండల కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బానోత్ భాస్కర్, దేవరుప్పుల మండల ఎస్టీ సెల్ యువజన అధ్యక్షుడు గుగులోతు నరేందర్, నల్లకుంట తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, పొట్టిగుట్ట తండా గ్రామ అధ్యక్షుడు నునావత్ నరసింహ, మూడ వీరన్నతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.