కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ
కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం
రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ
గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం
వెల్గటూర్ మండల పరిధిలోని రాజక్కపల్లి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం అన్నారు. గ్రామంలోని వడ్డెర కాలనీకి “శివాజీ నగర్ కాలనీ”గా అధికారిక నామకరణం చేస్తూ ఆయన కాలనీ బోర్డును ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి కాలనీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వడ్డెర కాలనీకి “శివాజీ నగర్ కాలనీ”గా పేరు పెట్టడం వల్ల ఇక్కడి ప్రజలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, రాబోయే రోజుల్లో కాలనీలో మరిన్ని ముందడుగులు వేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
తరలివచ్చిన గ్రామస్తులు
ఈ నామకరణ మహోత్సవంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మర్రి పోచయ్య, దొరిశెట్టి లక్ష్మి - తిరుపతి, బోడుకుంటి శారదా పోచయ్య, పల్లపు శ్రీనివాస్, ప్రశాంత్, సతీష్, రాజు, మనోహర్, సురేష్, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.