BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 31 May 2026, 04:44 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం ​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
31 May, 2026 - 04:44 PM
102 వీక్షణలు

​కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం

​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ

​గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం

​వెల్గటూర్ మండల పరిధిలోని రాజక్కపల్లి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం అన్నారు. గ్రామంలోని వడ్డెర కాలనీకి “శివాజీ నగర్ కాలనీ”గా అధికారిక నామకరణం చేస్తూ ఆయన కాలనీ బోర్డును ఘనంగా ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి కాలనీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వడ్డెర కాలనీకి “శివాజీ నగర్ కాలనీ”గా పేరు పెట్టడం వల్ల ఇక్కడి ప్రజలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, రాబోయే రోజుల్లో కాలనీలో మరిన్ని ముందడుగులు వేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

​తరలివచ్చిన గ్రామస్తులు

​ఈ నామకరణ మహోత్సవంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మర్రి పోచయ్య, దొరిశెట్టి లక్ష్మి - తిరుపతి, బోడుకుంటి శారదా పోచయ్య, పల్లపు శ్రీనివాస్, ప్రశాంత్, సతీష్, రాజు, మనోహర్, సురేష్, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.