BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం ​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
31 May, 2026 - 04:44 PM
32 వీక్షణలు

​కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం

​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ

​గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం

​వెల్గటూర్ మండల పరిధిలోని రాజక్కపల్లి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం అన్నారు. గ్రామంలోని వడ్డెర కాలనీకి “శివాజీ నగర్ కాలనీ”గా అధికారిక నామకరణం చేస్తూ ఆయన కాలనీ బోర్డును ఘనంగా ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి కాలనీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వడ్డెర కాలనీకి “శివాజీ నగర్ కాలనీ”గా పేరు పెట్టడం వల్ల ఇక్కడి ప్రజలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, రాబోయే రోజుల్లో కాలనీలో మరిన్ని ముందడుగులు వేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

​తరలివచ్చిన గ్రామస్తులు

​ఈ నామకరణ మహోత్సవంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మర్రి పోచయ్య, దొరిశెట్టి లక్ష్మి - తిరుపతి, బోడుకుంటి శారదా పోచయ్య, పల్లపు శ్రీనివాస్, ప్రశాంత్, సతీష్, రాజు, మనోహర్, సురేష్, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.