BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

కాఫీ డే లో చెలరేగిన మంటలు : తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
12 Apr, 2026 - 09:27 PM
355 వీక్షణలు

కాఫీ డే లో చెలరేగిన మంటలు : తప్పిన పెను ప్రమాదం

చిట్యాల నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఉన్న  ‘కాఫీ డే’ అవుట్‌లెట్ వెనుక భాగంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ​కాఫీ డే వెనుక భాగంలో నిల్వ ఉంచిన కట్టెలకు  ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, సమీపంలోనే ఉన్న జనరేటర్ మరియు ఏసీ యూనిట్ల మధ్యకు చేరుకున్నాయి. మంటలు జనరేటర్‌కు గనుక తగిలి ఉంటే భారీ పేలుడు సంభవించి పెను నష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ​ప్రమాద సమాచారం అందిన వెంటనే రామన్నపేట అగ్నిమాపక శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఇతర విభాగాలకు వ్యాపించకుండా చాకచక్యంగా వ్యవహరించి, నీటిని చల్లి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో ఫైర్ ఇంజిన్ రావడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది.  ఆస్తి నష్టం,  ప్రాణాపాయం కూడా తప్పిందని స్థానికులు కొనియాడారు. వేసవి కాలం దృష్ట్యా వాణిజ్య సముదాయాలు తమ జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ సిబ్బంది తెలిపారు అంతేకాకుండా ఎండు గడ్డి, కట్టెలు వంటి మండే స్వభావం గల వస్తువులను ఉంచకూడదని, అగ్నిమాపక నిబంధనలు పాటించాలని అగ్నిమాపక అధికారులు సూచించారు..