కార్మికుల ఆగ్రహానికి దిగివచ్చిన యోగి ఆదిత్యనాథ్!
కార్మికుల ఆగ్రహానికి దిగివచ్చిన యోగి ఆదిత్యనాథ్!
నాలుగు లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చామని భుజాలు ఎగరేస్తున్న పాలకులకు, బిజెపి పాలిత రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్మిక ఆగ్రహానికి దిగివచ్చి వారి డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టవలసి వచ్చిందంటే ఇది కార్మిక విజయమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో సోమవారంవేలాది కార్మికులు చేపట్టిన భారీ ఆందోళన పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వానికి చెమటలు పట్టించాయని డి హరినాథ్ అన్నారు, కనీస వేతనాలు ఇవ్వకపోవడం, వారాంతపుసెలవులు మంజూరు చేయకపోవడం కార్మికుల ఆగ్రహాన్ని రగిలించింది. కార్మికులు వేల సంఖ్యలో నోయిడా- ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధనంతో రవాణా స్తంభించిపోగాగత్యంతరం లేక దిగివచ్చి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారని ఇది కార్మిక విజయమనిహరినాథ్ అన్నారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తే వారిని ఉగ్రవాదులుగా పేర్కొనటం అవివేకం అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయించిన 36,000 వేతనం పారిశ్రామిక వర్గాలు ఇవ్వకపోతే కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడకతప్పదని హరినాథ్ హెచ్చరించారు.