BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

కార్మికుల ఆగ్రహానికి దిగివచ్చిన యోగి ఆదిత్యనాథ్!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 11:30 AM
74 వీక్షణలు

కార్మికుల ఆగ్రహానికి దిగివచ్చిన యోగి ఆదిత్యనాథ్!

నాలుగు లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చామని భుజాలు ఎగరేస్తున్న పాలకులకు, బిజెపి పాలిత రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్మిక ఆగ్రహానికి దిగివచ్చి వారి డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టవలసి వచ్చిందంటే ఇది కార్మిక విజయమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో సోమవారంవేలాది కార్మికులు చేపట్టిన భారీ ఆందోళన పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వానికి చెమటలు పట్టించాయని డి హరినాథ్ అన్నారు, కనీస వేతనాలు ఇవ్వకపోవడం, వారాంతపుసెలవులు మంజూరు చేయకపోవడం కార్మికుల ఆగ్రహాన్ని రగిలించింది. కార్మికులు వేల సంఖ్యలో నోయిడా- ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధనంతో రవాణా స్తంభించిపోగాగత్యంతరం లేక దిగివచ్చి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారని ఇది కార్మిక విజయమనిహరినాథ్ అన్నారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తే వారిని ఉగ్రవాదులుగా పేర్కొనటం అవివేకం అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయించిన 36,000 వేతనం పారిశ్రామిక వర్గాలు ఇవ్వకపోతే కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడకతప్పదని హరినాథ్ హెచ్చరించారు.