BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 04:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద ఏసీబీ దాడులు వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు.. బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ అదుపులో

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 04:11 PM
16 వీక్షణలు

నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. వాహనాలను నిలిపి వాహనదారుల నుంచి భారీ మొత్తంలో అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

ఈ తనిఖీల్లో బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించిన కారును ఆకస్మికంగా తనిఖీ చేయగా రూ.2.48 లక్షల నగదు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నగదుతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

వాహనాలను తనిఖీల పేరుతో నిలిపి అక్రమంగా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గోపీనాథ్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

నగదు ఎక్కడి నుంచి వచ్చింది? వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు జరిగాయా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దాడులు, విచారణ పూర్తయిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.