BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు..? నితీశ్‌కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు!

జాతీయం జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 09:40 PM
172 వీక్షణలు

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు జరిగే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బిహార్ మాజీ సీఎం, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన నితీష్ కుమార్ కు కేంద్ర క్యాబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 

అలాగే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న మరో ఇద్దరు నేతలను పదవులకు రాజీనామా చేయించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకురావచ్చనే చర్చ కూడా సాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒకేసారి రెండు, మూడు శాఖలను నిర్వహిస్తున్న కొందరు కేంద్ర మంత్రుల బాధ్యతలను పునర్వ్యవస్థీకరించి కొత్తవారికి కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైల్వే, ఐటీ, పౌర విమానయాన శాఖల్లో మార్పులు ఉండొచ్చని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఊహాగానాలుగానే ఉన్నాయని, అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.