BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపుపై బిల్లుకు సిద్ధత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 08:58 AM
205 వీక్షణలు

కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు  లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపుపై బిల్లుకు సిద్ధత

న్యూఢిల్లీ, మార్చి 24: దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసేలా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను సుమారు 50 శాతం పెంచే దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.

ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలను 816కు పెంచే ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కు పెరిగే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 263కు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. 2029 సాధారణ ఎన్నికల నుంచి అమలు చేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన NDA సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం ఈ ప్రతిపాదనపై ప్రాథమిక వివరాలు వెల్లడించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే, ఈ నిర్ణయం అమలులోకి రావాలంటే పార్లమెంట్ ఆమోదం అవసరం ఉండటంతో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.