BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపుపై బిల్లుకు సిద్ధత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 08:58 AM
168 వీక్షణలు

కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు  లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపుపై బిల్లుకు సిద్ధత

న్యూఢిల్లీ, మార్చి 24: దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసేలా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను సుమారు 50 శాతం పెంచే దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.

ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలను 816కు పెంచే ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కు పెరిగే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 263కు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. 2029 సాధారణ ఎన్నికల నుంచి అమలు చేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన NDA సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం ఈ ప్రతిపాదనపై ప్రాథమిక వివరాలు వెల్లడించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే, ఈ నిర్ణయం అమలులోకి రావాలంటే పార్లమెంట్ ఆమోదం అవసరం ఉండటంతో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.