BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 25 March 2026, 09:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కెమెరాలే నిరసన ప్రకటిస్తే… ఢిల్లీలో జర్నలిస్టుల ఆవేదనకు ప్రతీక

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:41 PM
159 వీక్షణలు

కెమెరాలే నిరసన ప్రకటిస్తే… ఢిల్లీలో జర్నలిస్టుల ఆవేదనకు ప్రతీక

ఢిల్లీలో నిన్న చోటుచేసుకున్న సంఘటనలు మీడియా స్వేచ్ఛపై మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక విద్యార్థిపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తుండగా, ఆ దృశ్యాన్ని హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ తన కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడున్న ఓ పోలీసు అధికారి “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించడంతో, పోలీసులు ఆమెపై దాడి చేసి కెమెరాను లాక్కున్నట్లు సమాచారం.

అదే సమయంలో మరో మహిళా జర్నలిస్టును ఒక పోలీసు అధికారి ఛాతీపై చెయ్యి వేసి వెనక్కి తోసిన ఘటన కలకలం రేపింది. అనంతరం ఆమెను విద్యార్థిని అనుకుని తోశామని పోలీసులు వివరణ ఇచ్చినా, ఈ చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై ఇటువంటి ప్రవర్తనను ఎలా సమర్థించగలరని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఫస్ట్ పోస్ట్ విలేఖరి ప్రవీణ్ సింగ్ చేతికి తీవ్ర గాయం కాగా, మరికొందరు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.

ఈ ఘటనకు నిరసనగా ఇవాళ ఢిల్లీలో ఫోటో జర్నలిస్టులు పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలను నేలపై ఉంచి నిరసన తెలిపారు. “చిత్రాలు అక్షరాల కంటే ఎక్కువగా మాట్లాడతాయి” అన్న మాటకు నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యం, మీడియాపై దాడులకు ప్రతీకగా మారింది.