BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

కెమెరాలే నిరసన ప్రకటిస్తే… ఢిల్లీలో జర్నలిస్టుల ఆవేదనకు ప్రతీక

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:41 PM
84 వీక్షణలు

కెమెరాలే నిరసన ప్రకటిస్తే… ఢిల్లీలో జర్నలిస్టుల ఆవేదనకు ప్రతీక

ఢిల్లీలో నిన్న చోటుచేసుకున్న సంఘటనలు మీడియా స్వేచ్ఛపై మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక విద్యార్థిపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తుండగా, ఆ దృశ్యాన్ని హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ తన కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడున్న ఓ పోలీసు అధికారి “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించడంతో, పోలీసులు ఆమెపై దాడి చేసి కెమెరాను లాక్కున్నట్లు సమాచారం.

అదే సమయంలో మరో మహిళా జర్నలిస్టును ఒక పోలీసు అధికారి ఛాతీపై చెయ్యి వేసి వెనక్కి తోసిన ఘటన కలకలం రేపింది. అనంతరం ఆమెను విద్యార్థిని అనుకుని తోశామని పోలీసులు వివరణ ఇచ్చినా, ఈ చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై ఇటువంటి ప్రవర్తనను ఎలా సమర్థించగలరని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఫస్ట్ పోస్ట్ విలేఖరి ప్రవీణ్ సింగ్ చేతికి తీవ్ర గాయం కాగా, మరికొందరు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.

ఈ ఘటనకు నిరసనగా ఇవాళ ఢిల్లీలో ఫోటో జర్నలిస్టులు పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలను నేలపై ఉంచి నిరసన తెలిపారు. “చిత్రాలు అక్షరాల కంటే ఎక్కువగా మాట్లాడతాయి” అన్న మాటకు నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యం, మీడియాపై దాడులకు ప్రతీకగా మారింది.