BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

కెమెరాలే నిరసన ప్రకటిస్తే… ఢిల్లీలో జర్నలిస్టుల ఆవేదనకు ప్రతీక

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:41 PM
61 వీక్షణలు

కెమెరాలే నిరసన ప్రకటిస్తే… ఢిల్లీలో జర్నలిస్టుల ఆవేదనకు ప్రతీక

ఢిల్లీలో నిన్న చోటుచేసుకున్న సంఘటనలు మీడియా స్వేచ్ఛపై మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక విద్యార్థిపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తుండగా, ఆ దృశ్యాన్ని హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ తన కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడున్న ఓ పోలీసు అధికారి “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించడంతో, పోలీసులు ఆమెపై దాడి చేసి కెమెరాను లాక్కున్నట్లు సమాచారం.

అదే సమయంలో మరో మహిళా జర్నలిస్టును ఒక పోలీసు అధికారి ఛాతీపై చెయ్యి వేసి వెనక్కి తోసిన ఘటన కలకలం రేపింది. అనంతరం ఆమెను విద్యార్థిని అనుకుని తోశామని పోలీసులు వివరణ ఇచ్చినా, ఈ చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై ఇటువంటి ప్రవర్తనను ఎలా సమర్థించగలరని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఫస్ట్ పోస్ట్ విలేఖరి ప్రవీణ్ సింగ్ చేతికి తీవ్ర గాయం కాగా, మరికొందరు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.

ఈ ఘటనకు నిరసనగా ఇవాళ ఢిల్లీలో ఫోటో జర్నలిస్టులు పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలను నేలపై ఉంచి నిరసన తెలిపారు. “చిత్రాలు అక్షరాల కంటే ఎక్కువగా మాట్లాడతాయి” అన్న మాటకు నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యం, మీడియాపై దాడులకు ప్రతీకగా మారింది.