BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

కెమెరాలే నిరసన ప్రకటిస్తే… ఢిల్లీలో జర్నలిస్టుల ఆవేదనకు ప్రతీక

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:41 PM
121 వీక్షణలు

కెమెరాలే నిరసన ప్రకటిస్తే… ఢిల్లీలో జర్నలిస్టుల ఆవేదనకు ప్రతీక

ఢిల్లీలో నిన్న చోటుచేసుకున్న సంఘటనలు మీడియా స్వేచ్ఛపై మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక విద్యార్థిపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తుండగా, ఆ దృశ్యాన్ని హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ తన కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడున్న ఓ పోలీసు అధికారి “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించడంతో, పోలీసులు ఆమెపై దాడి చేసి కెమెరాను లాక్కున్నట్లు సమాచారం.

అదే సమయంలో మరో మహిళా జర్నలిస్టును ఒక పోలీసు అధికారి ఛాతీపై చెయ్యి వేసి వెనక్కి తోసిన ఘటన కలకలం రేపింది. అనంతరం ఆమెను విద్యార్థిని అనుకుని తోశామని పోలీసులు వివరణ ఇచ్చినా, ఈ చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై ఇటువంటి ప్రవర్తనను ఎలా సమర్థించగలరని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఫస్ట్ పోస్ట్ విలేఖరి ప్రవీణ్ సింగ్ చేతికి తీవ్ర గాయం కాగా, మరికొందరు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.

ఈ ఘటనకు నిరసనగా ఇవాళ ఢిల్లీలో ఫోటో జర్నలిస్టులు పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలను నేలపై ఉంచి నిరసన తెలిపారు. “చిత్రాలు అక్షరాల కంటే ఎక్కువగా మాట్లాడతాయి” అన్న మాటకు నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యం, మీడియాపై దాడులకు ప్రతీకగా మారింది.