కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా | లక్షెట్టిపేట్ | NTODAY NEWS
మంచిర్యాల జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా దివంగతుడి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నలిమెల సత్తయ్యతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు. దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ఆర్జీపీఆర్ఎస్ నాయకుడు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు నాగభూషణం, పూర్ణచంద్రరావు, మంచిర్యాల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, కౌన్సిలర్లు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.