BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం కళ్లముందే కన్నతల్లి..

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
19 May, 2026 - 06:50 PM
150 వీక్షణలు

పని ముగించుకొని ఇంటి బాట పట్టిన ఓ తల్లి.. కుమారుల కళ్లముందే రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చౌటుప్పల్ మండలం

దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన ఏనుగు అనసూయ (56) తన ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్రవాహనంపై చౌటుప్పల్‌కు వచ్చింది. పనులు ముగించుకొని తిరిగి గ్రామానికి వెళ్తుండగా స్థానిక టీడీపీ కార్యాలయం సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనసూయ రోడ్డుపై పడిపోగా, డీసీఎం వాహనం ఆమె తలపై నుంచి వెళ్లింది. దీంతో మెదడు చిట్లిపోయి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ఇద్దరు కుమారులు స్వల్ప గాయలతో బయటపడ్డారు. కళ్లముందే తమ కన్నతల్లి రక్తపు మడుగులో పడిపోయి విగతజీవిగా మారడంతో కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.