BREAKING
ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ​అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్ ​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు 175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి! పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మరో బంపర్ ఆఫర్ బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ​అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్ ​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు 175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి! పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మరో బంపర్ ఆఫర్ బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం
www.ntodaynews.com

చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం కళ్లముందే కన్నతల్లి..

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
19 May, 2026 - 06:50 PM
72 వీక్షణలు

పని ముగించుకొని ఇంటి బాట పట్టిన ఓ తల్లి.. కుమారుల కళ్లముందే రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చౌటుప్పల్ మండలం

దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన ఏనుగు అనసూయ (56) తన ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్రవాహనంపై చౌటుప్పల్‌కు వచ్చింది. పనులు ముగించుకొని తిరిగి గ్రామానికి వెళ్తుండగా స్థానిక టీడీపీ కార్యాలయం సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనసూయ రోడ్డుపై పడిపోగా, డీసీఎం వాహనం ఆమె తలపై నుంచి వెళ్లింది. దీంతో మెదడు చిట్లిపోయి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ఇద్దరు కుమారులు స్వల్ప గాయలతో బయటపడ్డారు. కళ్లముందే తమ కన్నతల్లి రక్తపు మడుగులో పడిపోయి విగతజీవిగా మారడంతో కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.