BREAKING
బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

కొణిజర్లలో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలపై అవగాహన కల్పించిన ఆర్డీఓ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jul, 2026 - 03:33 PM
19 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామ సచివాలయాన్ని ఆర్డీఓ ఏ. కుమార్ శనివారం సందర్శించారు. రీసర్వే పూర్తైన నేపథ్యంలో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల మంజూరు ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు విడుదల చేసిన డ్రాఫ్ట్ పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. వాటిలో పేరు, తండ్రి పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, చిరునామా, భూ విస్తీర్ణం తదితర వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సరిచేసుకోవాలని తెలిపారు. అనంతరం ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేయనున్నట్లు వివరించారు.

అనంతరం రైతులతో సమావేశమై ప్రస్తుత ఖరీఫ్ సాగు పరిస్థితులపై ఆరా తీశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గంపలగూడెం తహసీల్దార్, రెవెన్యూ శాఖ వీఆర్వోలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.