BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

కోటిలింగాలలో ఘనంగా హనుమాన్ దేవాలయ భూమి పూజ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
01 Apr, 2026 - 03:11 PM
75 వీక్షణలు

కోటిలింగాలలో ఘనంగా హనుమాన్ దేవాలయ భూమి పూజ - పాల్గొన్న శైలందర్ రెడ్డి

​వెల్గటూర్ (కోటిలింగాల): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలోని చారిత్రక పుణ్యక్షేత్రం కోటిలింగాలలో ఈరోజు నూతన హనుమాన్ దేవాలయ నిర్మాణానికి అత్యంత వైభవంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

​ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉమ్మడి ఎండపల్లి, వెల్గటూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు శ్రీ శైలందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు.

​ఈ సందర్భంగా శైలందర్ రెడ్డి మాట్లాడుతూ, కోటిలింగాల క్షేత్రంలో హనుమాన్ దేవాలయం నిర్మించడం ఎంతో అభినందనీయమని, ఇది భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పలువురు కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.