కోటిలింగాలలో ఘనంగా హనుమాన్ దేవాలయ భూమి పూజ
కోటిలింగాలలో ఘనంగా హనుమాన్ దేవాలయ భూమి పూజ - పాల్గొన్న శైలందర్ రెడ్డి
వెల్గటూర్ (కోటిలింగాల): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలోని చారిత్రక పుణ్యక్షేత్రం కోటిలింగాలలో ఈరోజు నూతన హనుమాన్ దేవాలయ నిర్మాణానికి అత్యంత వైభవంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉమ్మడి ఎండపల్లి, వెల్గటూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు శ్రీ శైలందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శైలందర్ రెడ్డి మాట్లాడుతూ, కోటిలింగాల క్షేత్రంలో హనుమాన్ దేవాలయం నిర్మించడం ఎంతో అభినందనీయమని, ఇది భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పలువురు కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.