BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

జాతీయం జాతీయం
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
25 Mar, 2026 - 10:23 PM
104 వీక్షణలు

కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

వెల్గటూర్:

శాతవాహనుల తొలి రాజధాని, ప్రముఖ శైవ క్షేత్రమైన కోటిలింగాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన కోటిలింగాల అభివృద్ధిపై గళమెత్తారు.

​వారసత్వ సంపదను వెలికితీయాలి:

శాతవాహన సామ్రాజ్యానికి పురిటిగడ్డ అయిన కోటిలింగాల భూగర్భంలో ఎంతో చారిత్రక సంపద నిక్షిప్తమై ఉందని ఎంపీ పేర్కొన్నారు. పురావస్తు శాఖ ద్వారా ఇక్కడ మరిన్ని తవ్వకాలు జరిపి, ఆ వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రామగిరి ఖిల్లాతో పాటు కోటిలింగాలను పర్యాటక సర్క్యూట్‌లో చేర్చి, ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

​ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి:

కోటిలింగాల అంటే తెలుగు వారి గుండె చప్పుడు అని అభివర్ణించిన వంశీకృష్ణ, ఈ ప్రాంతానికి క్రీస్తు పూర్వం 200 ఏళ్ల ఘన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన ప్రణాళికలతో అభివృద్ధి చేస్తే, ధర్మపురి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులకు పర్యాటక రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన సూచించారు. భావితరాలకు మన చరిత్రను తెలియజేసేలా కోటిలింగాలను తీర్చిదిద్దాలని ఎంపీ కేంద్రానికి విన్నవించారు.