www.ntodaynews.com
కూతురి కోరిక మేరకు నార్కెట్పల్లిలో అన్నదానం
తెలంగాణ
/
నల్గొండ
/
నార్కెట్ పల్లి
నార్కెట్పల్లి మండలం మాదారం (ఏడవెల్లి) గ్రామ వాస్తవ్యులు కొప్పు సురేందర్ - అర్చన దంపతుల కుమార్తె కొప్పు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా నార్కెట్పల్లిలోని 'మనం' స్వచ్ఛంద సంస్థలో 580వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారి ఆరాధ్య కోరిక మేరకు సుమారు 100 మంది నిరుపేదలకు, నిస్సహాయులకు, బాటసారులకు ఈ అన్నదానం చేసినట్లు తండ్రి సురేందర్ తెలిపారు. తన కూతురు ఇంటి దేవత అని, ఆమె పుట్టినరోజున ఇలాంటి పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం మనసుకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కొప్పు నాగరాజు, కొప్పు జంగయ్య, కొప్పు ప్రేమ్ కుమార్, దైద అనిల్, మంద మనోజ్, పాల శివ తదితరులు పాల్గొన్నారు.