BREAKING
కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే
www.ntodaynews.com

కొత్త టెక్నాలజీతో ఇంటర్ మెమోలు.. ఇక చిరగవు, తడవవు!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:55 PM
9 వీక్షణలు

కొత్త టెక్నాలజీతో ఇంటర్ మెమోలు.. ఇక చిరగవు, తడవవు!

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇకపై ఇంటర్ మెమోలు చిరిగిపోవడం, తడిసి పాడవడం వంటి సమస్యలకు చెక్ పడనుంది. ఈ ఏడాది నుంచే నాన్ టియరబుల్ టెక్నాలజీతో రూపొందించిన ఆధునిక మెమోలను అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.

ఈ మేరకు 2026 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన సుమారు 4 లక్షల మంది విద్యార్థులకు ఆగస్టు 15లోగా కొత్త తరహా మెమోలను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటివరకు కాగితంపై ముద్రించిన మెమోలు వర్షాలు, వరదలు లేదా నిర్లక్ష్యంతో దెబ్బతినడం వల్ల విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడేవి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నాన్ టియరబుల్ మెటీరియల్‌ను ఉపయోగించాలని బోర్డు నిర్ణయించింది.

అంతేకాకుండా, ప్రతి మెమోపై విద్యార్థి రంగు ఫొటోను ముద్రించడం ద్వారా నకిలీ సర్టిఫికెట్ల తయారీకి అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల మెమోల భద్రత పెరగడంతో పాటు, వాటి ప్రామాణికతను సులభంగా నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది.

ఈ నిర్ణయంతో విద్యార్థులకు దీర్ఘకాలం మన్నికైన, భద్రమైన మెమోలు అందుబాటులోకి రానుండగా, విద్యా ధ్రువపత్రాల నిర్వహణలో తెలంగాణ ఇంటర్ బోర్డు మరో సాంకేతిక ముందడుగు వేసినట్టుగా విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.