BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

కర్ణాటకలో విద్యార్థులకు తప్పనిసరి హెచ్‌ఐవీ పరీక్షలు యువతలో పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 02:52 PM
21 వీక్షణలు

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హెచ్‌ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. యువతలో హెచ్‌ఐవీ వ్యాప్తిని ముందుగానే గుర్తించి నివారించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) తాజా గణాంకాల ప్రకారం కర్ణాటకలో సుమారు 2.60 లక్షల మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 54 వేల మందికి తమకు వైరస్ సోకిన విషయం తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల 7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడైంది. ఈ పరిణామం నేపథ్యంలో కళాశాలల్లోనే ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు, నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీని ప్రకారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లో క్రమం తప్పకుండా హెచ్‌ఐవీ పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హెచ్‌ఐవీ ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ముందస్తు గుర్తింపు ద్వారా సకాలంలో చికిత్స అందించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.