www.ntodaynews.com
కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వేను ప్రారంభించిన కార్పొరేటర్ త్రివేణి
తెలంగాణ
/
మంచిర్యాల
కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వేను ప్రారంభించిన కార్పొరేటర్ త్రివేణి
మంచిర్యాల జిల్లా ముల్యాల గ్రామంలో సోమవారం కుష్టు వ్యాధి నిర్ధారణ ఉద్యమ సర్వే కార్యక్రమాన్ని కార్పొరేటర్ బియ్యాల త్రివేణి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, వారికి మెరుగైన ఉచిత చికిత్స అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని జిల్లా కుష్టు నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ తెలిపారు.
ప్రజల్లో కుష్టు వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించి, ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి అని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు