BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ డబ్బులు.. ఒక్కరోజే ఛాన్స్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 01:05 PM
78 వీక్షణలు

ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ డబ్బులు.. ఒక్కరోజే ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతుభరోసా’ పథకానికి సంబంధించి కొత్త నమోదులకు ప్రభుత్వం గడువు విధించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ (మార్చి 25)తో ముగియనుంది. ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫిబ్రవరి 28 నాటికి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. అర్హులైన రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పట్టాదారు పాస్‌పుస్తకం మరియు అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించాలి.

ఈ పత్రాలతో సంబంధిత మండల కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులకు (AEOలు) దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత మరో అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అందువల్ల ఇంకా దరఖాస్తు చేయని రైతులు ఈ ఒక్కరోజు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.