ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ డబ్బులు.. ఒక్కరోజే ఛాన్స్
ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ డబ్బులు.. ఒక్కరోజే ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతుభరోసా’ పథకానికి సంబంధించి కొత్త నమోదులకు ప్రభుత్వం గడువు విధించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ (మార్చి 25)తో ముగియనుంది. ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఫిబ్రవరి 28 నాటికి పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. అర్హులైన రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, పట్టాదారు పాస్పుస్తకం మరియు అప్లికేషన్ ఫారమ్ను సమర్పించాలి.
ఈ పత్రాలతో సంబంధిత మండల కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులకు (AEOలు) దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత మరో అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అందువల్ల ఇంకా దరఖాస్తు చేయని రైతులు ఈ ఒక్కరోజు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.