భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం
లక్సెట్టిపేట: భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం
లక్సెట్టిపేట: లక్సెట్టిపేట మండలం చందారం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, సుదర్శన హోమం, గజారోహణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చందారం గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.