www.ntodaynews.com
లక్సెట్టిపేటలో బీజేపీ నేతల నిరసన
తెలంగాణ
/
మంచిర్యాల
/
లక్సెట్టిపేట
లక్సెట్టిపేటలో బీజేపీ నేతల నిరసన: ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు సహించబోం: బీజేపీ నాయకుల ఆగ్రహం
లక్సెట్టిపేటలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం ప్రధాన రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు. దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధానిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగగా, తక్షణమే కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి