BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

కడెం కాలువలో పడి రైతు మృతి

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 05:31 PM
72 వీక్షణలు

లక్షెట్టిపేట: కడెం కాలువలో పడి రైతు మృతి

లక్షెట్టిపేట, ఏప్రిల్ 06: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన విషాద ఘటన లక్షెట్టిపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..

ఘటన వివరాలు:

మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పోచంపల్లి గ్రామానికి చెందిన కోవా అన్ను (39) వృత్తిరీత్యా రైతు. ఆదివారం సాయంత్రం తన పంట పొలానికి నీరు పెట్టేందుకు కడెం కెనాల్ 38 డిస్ట్రిబ్యూటరీ వద్దకు వెళ్ళాడు. కెనాల్‌లోకి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. మృతుడికి ఈత రాకపోవడంతో ప్రవాహంలో మునిగి అక్కడికక్కడే మరణించాడు.

పోలీసుల దర్యాప్తు:

మృతుడు అన్నుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుని అన్న కోవ జంగు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్షెట్టిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ పేర్కొన్నారు. ఈ ఘటనతో పోచంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి