పాదం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
పాదం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ (మోడల్)కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాదం శ్రీనివాస్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సోమవారం వారి నివాసానికి వెళ్లి పాదం శ్రీనివాస్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పించారు.
పరామర్శ కార్యక్రమంలో లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ఆర్జీపీఆర్ఎస్ గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు నాగభూషణం, పూర్ణచంద్రరావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, కౌన్సిలర్లు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.