లక్షెట్టిపేట ప్రధాన రహదారిపై ఉచిత అంబలి పంపిణీ
లక్షెట్టిపేట ప్రధాన రహదారిపై ఉచిత అంబలి పంపిణీ
- పాల్గొన్న 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, నాయకులు
లక్షెట్టిపేట్: మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు - సురేఖమ్మల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం గురువారం లక్షెట్టిపేట్ పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన రహదారిపై కొనసాగింది. మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు మరియు బాటసారులకు అంబలిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, ప్రాంతీయ రవాణా అధికార సంస్థ సభ్యులు అంకత్ శ్రీనివాస్, పురపాలక సహచర సభ్యులు సయ్యద్ తైసిన్ హాజీ పాల్గొని మాట్లాడారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దంపతులు ప్రధాన రహదారిపై ఈ ఉచిత అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు సయ్యద్ హఫీజ్, లాగిశెట్టి వెంకట్ స్వామి, మోహన్, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.