www.ntodaynews.com
లక్షెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తెలంగాణ
/
మంచిర్యాల
/
లక్సెట్టిపేట
లక్షెట్టిపేట మండలంలోని శాంతాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రశాంత్ (22) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ గోపతి సురేష్ తెలిపారు. ప్రశాంత్ తన బైక్పై మంచిర్యాలకు వెళ్లి పని ముగించుకుని రాత్రి తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న స్కూటీ అతడి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపానికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి అతడు మృతి చెందాడు. ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు