BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయం ఘన ప్రారంభం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
07 Jun, 2026 - 05:28 PM
85 వీక్షణలు

​ముగ్గురు ఎస్ఐల చేతుల మీదుగా ప్రారంభోత్సవం

​సమాజ అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం: ఎస్ఐలు

​లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాన్ని లక్షెట్టిపేట ఎస్ఐ సురేష్, దండేపల్లి ఎస్ఐ రాజావర్దన్, జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని సందర్శించిన ఎస్ఐలు మీడియా సేవలను అభినందిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. బాధ్యతాయుతమైన జర్నలిజంతో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​అనంతరం లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చింత అభినయ్ మాట్లాడుతూ, తమ సర్కిల్ పరిధిలోని ముగ్గురు ఎస్ఐలు స్వయంగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమను ప్రోత్సహించిన ఎస్ఐలు సురేష్, రాజావర్దన్, ఉదయ్ కిరణ్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీసు శాఖ మరియు మీడియా పరస్పర సహకారంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ప్రజల సమస్యలను, స్థానిక అంశాలను నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేస్తూ మీడియా బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా సెక్రటరీ సంతోష్, సభ్యులు ప్రశాంత్, తిరుపతి, ముస్తఫా, రమేష్, మనోజ్, వినీత్, శ్రీనివాస్, సోక్ రెడ్డిస్ తదితరులు పాల్గొన్నారు