www.ntodaynews.com
లక్షెట్టిపేటలో పట్టుబడిన ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం
తెలంగాణ
/
మంచిర్యాల
/
లక్సెట్టిపేట
లక్షెట్టిపేటలో పట్టుబడిన ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం
లక్షెట్టిపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు ఈ నెల 29వ తేదీన ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో నిర్వహించబడే ఈ వేలం పాటలో పాల్గొనదలచిన ఆసక్తి గల అభ్యర్థులు, వాహనాల వివరాలు మరియు ఇతర నిబంధనల కోసం స్థానిక ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు