లంచ్ బాక్స్తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం
లంచ్ బాక్స్తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం విజయ్ సరికొత్త పంథా!
తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్ తన ప్రత్యేకమైన పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన చూపుతున్న క్రమశిక్షణ, సమయపాలన అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ నిర్దేశిత సమయానికి పావుగంట ముందుగానే చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ సచివాలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచే స్వయంగా లంచ్ బాక్స్ తీసుకువస్తూ సరళ జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తున్నారు.
భోజన విరామ సమయంలో కూడా తన ఛాంబర్కే పరిమితమై, భోజనం ముగిసిన వెంటనే తిరిగి అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. సీఎం విజయ్ పని తీరు ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ సమయపాలన, క్రమశిక్షణపై కొత్త చర్చకు దారితీస్తోంది.