www.ntodaynews.com
పాఠశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం
తెలంగాణ
కస్తూర్బా పాఠశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం
NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
విద్యార్థినిలకు న్యాయ అవగాహన – మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆత్మకూరు, నంద్యాల జిల్లా: విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజనల్ అధికారి ఆర్. రామాంజి నాయక్, ఆత్మకూరు అర్బన్ సీఐ ఓ. మహేశ్వర్ రెడ్డి సూచించారు.
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరన్ ఆదేశాలతో ఆదివారం పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముందు పాఠశాల ప్రత్యేక అధికారి శ్యామలాదేవి అధికారులను స్వాగతించారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి మరియు సీఐ మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే క్రమశిక్షణ అలవరచుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాంటి అలవాట్లకు బానిసలయ్యే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదువుతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు.
విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, తక్షణ పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
#Atmakur #KasturbaSchool #LegalAwareness #StudentSafety #NandyalPolice #DrugFreeYouth #EducationAwareness
Follow us on
Website
Facebook
Instagram
YouTube