www.ntodaynews.com
మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్
తెలంగాణ
/
జనగామ
మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్
దేవురుప్పల మండలం గోళ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆకవరం నర్సింహ రెడ్డి ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె ఆకవరం నర్సింహ రెడ్డి మరణంపై గాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కష్ట సమయంలో కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మండల నాయకులు, గ్రామస్థులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆకవరం నర్సింహ రెడ్డి గారికి నివాళులు అర్పించారు.