BREAKING
ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు BREAKING NEWS పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు BREAKING NEWS పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య
www.ntodaynews.com

మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 04:28 PM
16 వీక్షణలు

మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

కుటుంబం అంటే కేవలం భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కాదు.. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, మనవలు, మనవరాళ్లు అందరూ కలిసిన బంధాల సమాహారం. పరస్పర ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, సహాయ సహకారాలు ఉన్న చోటే నిజమైన కుటుంబం ఉంటుంది. అలాంటి కుటుంబమే ఆదర్శ కుటుంబం.. బంగారు కుటుంబం.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన సంస్కృతికి ప్రతీకగా నిలిచేది. ఇంట్లో పెద్దలు ఉండేవారు.. చిన్నవాళ్లకు మార్గదర్శకత్వం చేసేవారు. బంధువులు వస్తే ఇంటంతా సందడిగా మారేది. మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, అత్తలు.. ఇలా ప్రతి బంధానికి ప్రత్యేకమైన ఆప్యాయత ఉండేది. “కలసి ఉంటే కలదు సుఖం” అనే మాట జీవన విధానంగా ఉండేది.

కానీ గత మూడు దశాబ్దాలుగా పారిశ్రామికరణ, ఉపాధి అవకాశాలు, టెక్నాలజీ విస్తరణ, జీవనశైలిలో మార్పులు, స్వార్థపూరిత ఆలోచనలు, సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారడం వంటి కారణాలతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా బలహీనపడింది. అటాచ్మెంట్ స్థానంలో డిటాచ్మెంట్ పెరిగింది. పిల్లలకు తమ బంధువులే తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి.

చదువులు, ఉద్యోగాలు, కెరీర్ పేరుతో యువత దూర ప్రాంతాలు, విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. తమ కోసం జీవితాన్ని అంకితం చేసిన తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. ఫలితంగా కుటుంబ బంధాలు క్రమంగా కుంచించుకుపోతున్నాయి. ఒకప్పుడు బంధువులు వెళ్తుంటే బాధపడేవాళ్లం.. ఇప్పుడు కలిసి ఉండటానికే సమయం దొరకని పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తించిన United Nations 1994లో ప్రతి సంవత్సరం మే 15ను “అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం”గా నిర్వహించాలని నిర్ణయించింది. కుటుంబ విలువలు, బంధుత్వాల ప్రాధాన్యం, పరస్పర బాధ్యతలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

కుటుంబం ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అందరూ ఒకేచోట ఉండకపోయినా అవసర సమయంలో ఒకరికొకరు అండగా నిలబడటం నిజమైన కుటుంబ బలం.

ఆ రోజులు… ఆ అనుబంధాలు… ఆ బంధుత్వాల మాధుర్యం… ఇవన్నీ నేటికీ మరపురాని జ్ఞాపకాలే. కుటుంబ బంధాలను కాపాడుకోవడం, పెద్దలను గౌరవించడం, బంధాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత.