www.ntodaynews.com
మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
జాతీయం
ఆన్లైన్ ఫార్మసీల విధానాలకు నిరసనగా మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపునిచ్చింది.
ఈ సమ్మెలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 12.40 లక్షల మెడికల్ షాపులు మూతపడనున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం, భారీ తగ్గింపులతో చిన్న వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయడాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు కలగకుండా ఆన్లైన్ ఔషధ విక్రయాలపై కట్టుదిట్టమైన నియంత్రణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
దేశవ్యాప్తంగా బంద్ ప్రభావంతో అత్యవసర మందుల కొనుగోళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వెలువడుతున్నాయి.